Monday, August 31, 2009

ఎంసెట్ -పిల్లల పాలిట భూతమా

పిల్లలను బడిలో వేసినప్పటినుండే వారు ఇంజనీర్లుకావలెనా ,డాక్టర్లు కావలెనా అని తల్లిదండ్రులు ఆశించడము జరుగుతూఉంది . కాని వారి అభిరుచులు ఎలా ఉన్నాయ్ ,వారి ప్రతిభ ఏ విషయంలో ఉన్నది గమనించడము లేదు . పెద్దల కోరికలకు అనుగుణంగా నడవాలనే ఒక కనుపించని ఒత్తిడి పిల్లల కు అది నుండే కలిగించు చున్నాం .
వారు తమ శక్తి మేరకు ప్రయత్నించుతారు.అందులో చాల మంది పిల్లలు విఫలం అయ్యే ఆస్కారం ఉంది . తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసికోవడానికి కార్పోరీట్ కాలేజిలు సదా సిద్దంగా ఉంటాయి .ఎంత డబ్బు ఖర్చు ఐన సరే అనుకునే తల్లిదండ్రుల కోరికలను వారు సొమ్ము చేసికొంటారు . కాలేజిలో చేర్పించింది మొదలు వాళ్ల ప్రతాపము చూపెడతారు . తిండికి నిద్రకు పిల్లలు మొహం వాచే తట్లుగా తయారు అయిపోతారు . ఈ నిరంతర శ్రమను భరించలేని పిల్లలు కొంత మంది తల్లిదండ్రులతో గోడు వెల్లబోసుకుంటారు . కాని మెజారిటీ తల్లిదండ్రులు
విషయతీవ్రతను గుర్తించక వారిని బుజ్జగించి మళ్ళీ అదే కాలేజి లో చేర్పించుతారు .ఫలితంగానే నేడు మనము అత్యంత భాదాకరమైన పిల్లల ఆత్మహత్యలను చూడవలిసి వస్తున్నది . ఈ పరిస్థితికి కేవలము యజమాన్యమును తప్పు పట్టడము సరైనది కాదు .కార్పొరేటు కాలేజిలో ఎలా చదివిస్తారో అందరికి తెలుసు . కాని మనమే కోరి కోరి
పిల్లలను అక్కడ చేర్పించు తున్నాము .కాని పిల్లలకు తగిన మానసిక ధైర్యాన్ని మనము కలిగించి నట్లయ్తే వారు
సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోగాలుగుతారు .ఎప్పుడయినా ,ఎవరైనా ,ఎపనియినా ఇష్టంగా చేయాలి . అప్పుడు కష్టం అనిపించదు .ఆ దృక్పథాన్ని పిల్లలకు మనము కలిగించి నట్లైతే ఇక వారికి తిరుగేలేదు .
జయహో

1 comment: